మరో రెండు వారాల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట.. విషాదం నెలకొంది. చెల్లెలు పెళ్లి కోసం బీరువాలో ఉంచిన సుమారు రూ. 15 లక్షల నగదు, పది తులాల బంగారు, వెండి నగలు, పట్టుచీరలు, కొత్త దుస్తులు కాలి బూడిదయ్యాయి. ఇంట్లో షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో పెళ్లి సామగ్రి మొత్తం దగ్ధమైంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి మోహన్రావు, నరసారావుల ఇంట్లో సోమవారం ఈ సంఘటన జరిగింది.