బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురంలో వెలసిన మద్దిలేటి నరసింహస్వామి, అమ్మవార్లను మండల తెదేపా నాయకులు శనివారం పూజించారు. మండల కన్వీనరు, ఆలయ మాజీ చైర్మన్ ఉన్నం ఎల్ల నాగయ్య, పోలూరు రాఘవరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి, తిరుమలేష్ చౌదరి తదితరులు పూజలు చేసి మొక్కులు చెల్లించారు. వారికి అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఉన్నం పాలశేఖర్, సుధాకర్, నామం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.