సుంకేసుల బ్యారేజీకి కొనసాగుతున్న నీటి ప్రవాహం

62చూసినవారు
కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి సుంకేసుల బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. గురువారం ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహం కొంత తగ్గింది. సుంకేసుల జలాశయానికి 33, 798 క్యుసెక్కుల నుంచి 22, 641 క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీ గేట్లు 5 పైకెత్తి 20, 196 క్యుసెక్కుల నీరు, కేసీ కాలువకు 2, 445 క్యుసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్