కోడుమూరు నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్థులు సోమవారం ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారని కోడుమూరు అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి శేషిరెడ్డి తెలిపారు. యుగ తులసి పార్టీ నుంచి నడిపి గుండాలు, ఇండియా ప్రజా బంధు పార్టీ నుంచి రాజు, ఇండిపెండెంట్లుగా ఈ. బేబీ రాధా, ద్వారం సతీష్ లు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిగెల మురళీకృష్ణ నామినేషన్లు దాఖలు చేశారన్నారు.