కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో శంఖారావం కార్యక్రమం
కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో మల్లారెడ్డి ఆధ్వర్యంలో శంఖారావం కార్యక్రమం నిర్వహించామని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి జయసూర్య తెలిపారు. సోమవారం జయ సూర్య మాట్లాడుతూ టిడిపి మానిఫెస్టో, సూపర్6 పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించామని అన్నారు. విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలను విపరీతంగా పెంచేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు వైసిపి ప్రభుత్వం గురి చేస్తున్నదని టిడిపి అభ్యర్థి జయసూర్య మండిపడ్డారు.