
మంత్రాలయం: వర్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకం హర్షణీయం
వర్ఫ్ సవరణ బిల్లుకు వైసీపీ వ్యతిరేకంగా ఓటు వేస్తుందని మాజీ సీఎం జగన్ ప్రకటించడం హర్షణీయమని మంత్రాలయం వైసీపీ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు మహబూబ్ బుధవారం అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దశాబ్దాల నాటి వర్ఫ్ చట్టాన్ని మార్చాలని నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మతపరమైన రాద్ధాంతాన్ని ఖండించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకడం అన్యాయమని మండిపడ్డారు.