మంత్రాలయం మండలం మాధవరంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఘవేంద్రరెడ్డితోపాటు మాధవరం మాజీ సర్పంచ్ ఎన్. రఘునాథ్ రెడ్డి, టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొన్నారు. ఇందులో హుసేన్ ఆలం, ఉరుకుందు, మైబు, మహమ్మద్, ఇమ్రాన్, యాసిన్ పాల్గొన్నారు.