అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థి మృతి (వీడియో)

52చూసినవారు
కృష్ణా జిల్లా కానూరులోని ఎన్ఆర్ఐ కళాశాలలో ఓ ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కళాశాల యాజమాన్యం తెలుపగా.. ఆ సూసైడ్ నోట్ తమ కొడుకు రైటింగ్ కాదని, కావాలని కాలేజ్ యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాలి.

సంబంధిత పోస్ట్