నిప్పుల గుండంలో నమాజ్ చేసిన మహమ్మద్ అలీ

69చూసినవారు
కౌతాళం మండలంలోని కుంటనహాల్ గ్రామంలో మొహరం వేడుకలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున హసన్, ఉసేన్ పీర్ల దేవుళ్లు గ్రామంలోని భక్తుల నుండి ప్రత్యేక పూజలు అందుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగారు. అనంతరం మసీదు వద్ద ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో హసన్ ఉసేన్ పీర్ల దేవున్ని మోసిన మహమ్మద్ అలీ నమాజ్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్