నందికొట్కూరు: ఇళ్లల్లోకి చేరుతున్న వర్షపు నీరు

78చూసినవారు
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్, 14వ వార్డులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుతుంది. కాలనీవాసుల సమాచారం మేరకు నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే జయ సూర్య ఆదేశాల మేరకు నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ ఎస్. బేబీ, వైస్-చైర్మన్ మొల్ల రబ్బాని గురువారం కాలనీకి చేరుకొని ఇళ్లను పరిశీలించారు. పై నుండి వచ్చే నీళ్లకు పెద్ద డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్