
పాణ్యం: పల్లె ప్రగతికి పాటు పడుదాం: ఎంపీడీవో
పల్లె ప్రగతికి పాటు పడుదామని ఓర్వకల్లు ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు రెండో దశ మంగళవారం ముగిశాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, సచివాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడుతామని ప్రతిజ్ఞ చేశారు. శిక్షకులుగా మురళీ, గోపాల్ వ్యవహరించారు.