ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన పాటలతో పాడి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. తన గాత్రంతో ఐపీఎల్ అభిమానులందరినీ శ్రేయా ఘోషల్ అలరించారు. దీంతో ప్రేక్షకులుఅందరూ మైమరిచి పోయారు. ఈడెన్ గార్డెన్స్ మైదానం అంతా కాంతులతో రంగుల మయమైంది. పుష్ప సినిమాలో పాటను శ్రేయా ఘోషల్ ఆలపించారు. శ్రేయా ఘోషల్ పుష్పలోని 'చూసేకి అగ్గి రవ్వలా..' పాటను తెలుగులో ఆలపించారు.