నాగలదిన్నే దగ్గర బైకు ప్రమాదం.. యువకుడు మృతి

25660చూసినవారు
నాగలదిన్నే దగ్గర బైకు ప్రమాదం.. యువకుడు మృతి
నందవరం మండలం, నాగలదిన్నే గ్రామంలో శుక్రవారం జరిగిన బైక్ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్ ప్రాంతానికి చెందిన రవి ప్రకాష్ (21), లక్షింపేటకు చెందిన గణేష్ (22) ఇద్దరు పని నిమిత్తం నాగలదిన్నే కు వెళ్లి వస్తుండగా బైకు అదుపుతప్పి క్రింద పడటంతో రవి ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్