పింఛన్ లబ్దిదారులకు గ్రామ, వార్డు వాలంటీర్లు పింఛన్ డబ్బులు పంపిణీ చేయడంపై ఏపీ ఎన్నికల కమిషన్కు మాజీ SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. "పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి. పింఛన్ డబ్బులు చేతికి ఇవ్వడం వద్దు, అకౌంట్లలో వేయాలి." అని లేఖలో పేర్కొన్నారు.