తిరుపతిలోని ఎస్వీ జూలో సింహం మృతి

68చూసినవారు
తిరుపతిలోని ఎస్వీ జూలో సింహం మృతి
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో ఆదివారం అనురాగ్‌ అనే మగ సింహం(7) మృతి చెందింది. జూ పార్కులో పునరావాసం పొందుతున్న సింహాలకే జన్మించిన అనురాగ్‌.. పుట్టినప్పటి నుంచి జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతోంది. వయసుకు తగ్గ బరువు, పొడవు లేకపోవడం, కుడి కంటి చూపు కోల్పోవడం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల దాన్ని ప్రదర్శనకు ఉంచలేద‌ని జూ అధికారులు తెలిపారు. సాధార‌ణంగా సింహాలు 15-20 ఏళ్లు జీవిస్తాయి.

సంబంధిత పోస్ట్