AP: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తిరిగి మళ్లీ ఆరో తేదీ ఉదయం వైన్ షాపులు తెరుచుకుంటాయి. మూడు రోజులు మద్యం దుకాణాలు తెరుచుకోవని తెలియడంతో మందుబాబులు షాపుల వద్ద క్యూ కట్టారు. ముందుగానే తమ ఇళ్లలో కొద్ది పాటి స్టాక్ పెట్టుకోవడానికి వైన్ షాప్ల వద్ద ఎగబడ్డారు.