రోడ్డు ప్రమాదంలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గన్మెన్ గోపిరెడ్డి(30) మృతి చెందాడు. బాపట్ల జిల్లా ఉప్పెరపాలెంకు చెందిన గోపిరెడ్డి ఆదివారం బైక్పై బాపట్ల వస్తుండగా లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా RTC బస్సు రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి లారీ, ఆపై ముందు నుంచి బస్సు ఢీ కొట్టాయి. తీవ్ర గాయాలపాలైన గోపిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు.