ఏలూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏలూరు ఎంపీ టికెట్ పుట్టా మహేశ్ యాదవ్కు టీడీపీ కేటాయించింది. దాంతో అసంతృప్తిలో ఉన్న మాగంటి బాబు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. వైసీపీలో చేరేందుకు ముద్రగడ పద్మనాభంతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, 1998, 2014లో మాగంటి బాబు ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.