చంద్రబాబుతో భేటీపై మహారాష్ట్ర సీఎం శిందే ట్వీట్

59చూసినవారు
చంద్రబాబుతో భేటీపై మహారాష్ట్ర సీఎం శిందే ట్వీట్
ముంబై పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందేతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీకి సంబంధించిన ఫొటోలను శిందే తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్ చేశారు. ఏపీ, మ‌హారాష్ట్ర రాష్ట్రాలు పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చనే అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు శిందే పేర్కొన్నారు. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్