ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంపు: సీఎం

75చూసినవారు
ప్రతి సచివాలయంలో మెడికల్ క్యాంపు: సీఎం
ముంపు ప్రాంతాల్లో అంబులెన్స్‌లను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై బుధవారం మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి కుటుంబానికి సాయం అందించాలని సీఎం తెలిపారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించాలని చెప్పారు. ఎవరూ రాకపోతే ప్రభుత్వం తరఫున గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్