వైసీపీ నేత, MLC జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై జంగా కృష్ణమూర్తి స్పందిస్తూ.. అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. తాను పార్టీకి, పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. అయితే తనకు అర్హత ఉందనే గురజాల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నానని తెలిపారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం తర్వాతే తన నిర్ణయం ఉంటుందని చెప్పారు.