చంద్ర‌బాబు, పవన్‌పై ఎమ్మెల్సీ కళ్యాణి ఫైర్

74చూసినవారు
చంద్ర‌బాబు, పవన్‌పై ఎమ్మెల్సీ కళ్యాణి ఫైర్
AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల‌పై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్ అయ్యారు. "ముచ్చుమర్రిలో మైనర్ బాలిక.. అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటన జరిగి వారం గడుస్తున్నా కూటమి ప్రభుత్వంలో చలనం లేదు. బాబు, ప‌వ‌న్‌కు అంబానీ ఇంట్లో పెళ్లికి వెళ్లే సమయం ఉంది కానీ.. బాధితులను పరామర్శించేందుకు సమయం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారి తప్పాయి. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు" అని ఆమె ధ్వ‌జ‌మెత్తారు.

సంబంధిత పోస్ట్