సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మే నెల 3, 4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటించనున్నారు. 3వ తేదీన పీలేరులో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. 4వ తేదీన రాజమండ్రి, అనకాపల్లిలో జరిగే సభల్లోనూ పాల్గొని ప్రసంగిస్తారు.