ఉత్తరప్రదేశ్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు తెంచుకుని ఉడాయించారు. సీతాపూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయం నుంచి ఇంటికి తిరిగి వస్తున్న మహిళ మెడలోంచి బైక్పై వెళ్తున్న వ్యక్తులు గొలుసు లాక్కెళ్లారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది.