AP: రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో నవనగరాల నిర్మాణాలను ఏప్రిల్ 15 నుంచి 20లోగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద శంకుస్థాపన చేయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఏప్రిల్లో అమరావతికి రానున్నారు. కాగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం రూ.37,702 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచింది.