AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ విమర్శించింది. గన్నవరం నుంచి మంగళగిరికి వెళ్లడానికి రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ ఆరోపించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా.. ఇటు మహిళలపై దాడులు జరిగినా సేనాని కనిపించలేదు.’ అని ఎక్స్లో శుక్రవారం ట్వీట్ చేశారు.