కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ గాల్లో ఎగిరిపడ్డ ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తి బిజై కాపికాడ్లో బైక్పై వెళ్తున్న మురళిని హత్యాయత్నం చేయడానికి కారులో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఆ సమయంలో అటుగా రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళను కూడా కారు ఢీకొనడంతో ఆమె గాల్లో ఎగిరి ఓ ఇంటి గోడకు తలకిందులుగా వేలాడారు. మురళి, మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు సతీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.