గొర్రెల కాపరులకూ తుపాకి లైసెన్సు ఇవ్వాలని కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న కోరారు. శనివారం ఆదోనిలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలు కాసే సంఘాల ప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి వారికి తుపాకీ లైసెన్స్లు ఇచ్చేందుకు తీర్మానించాలని విన్నవించారు. గొర్రెలు దొంగతనమైన వెంటనే పోలీసులు కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు.