జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డియస్పీ పర్యవేక్షణలో ఈనెల 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన నిబంధనలపై పోలీసు అధికారులు శనివారం ఆదోని పట్టణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలను ప్రజలకు మైకు ద్వారా వివరించారు. ఎన్నికల ఫలితాల తరువాత కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.