మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో వినాయక చవితి సందర్భంగా శనివారం వాడ వాడలా బొజ్జగణపయ్యలు కొలువుదీరారు. కోసిగి, పెద్దకడబూరు, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో వినాయక మండపాల్లో కూర్చోబెట్టారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపయ్యల మండపాలను విద్యుత్ అలంకణలతో దీర్చిదిద్థారు.