ప్రభుత్వ అధికారులతో శ్రీ మఠం అధికారులు సమావేశం

80చూసినవారు
ప్రభుత్వ అధికారులతో శ్రీ మఠం అధికారులు సమావేశం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాల సందర్భంగా శ్రీ మఠం అధికారులు ఏర్పాట్ల పై స్థానిక ప్రభుత్వ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా ఆరాధన ఉత్సవాలలో భాగంగా భక్తులు రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని స్థానిక పోలీస్ అధికారులకు తెలియజేశారు. కరెంటు కోతలు విదించకుండా చూడాలని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులకు శ్రీ మఠం ముందు భాగంలో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్