ఓర్వకల్లు: శనగ విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి

85చూసినవారు
ఓర్వకల్లు: శనగ విత్తనాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేస్తున్న పప్పుశనగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. శనివారం ఓర్వకల్లులో వ్యవసాయాధికారి సుధాకర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చరితారెడ్డి, ఏడీఏ శాలురెడ్డి శనగ విత్తనాలను పంపిణీ చేసి, మాట్లాడారు. మండలానికి 2, 650 క్వింటాళ్ల పప్పు శనగ విత్తనాలు మంజూరయ్యాయని, రైతులకు అవసరమైతే ఇంకా మంజూరు చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్