
పాణ్యం: గిట్టుబాటు ధరలు పెంచి పొగాకు రైతులను ఆదుకోవాలి
ఐటీసీ పొగాకు కంపెనీ గోడౌన్ను పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి సందర్శించారు. శుక్రవారం ఆయన రైతుల కష్టాలను తెలుసుకుని, గిట్టుబాటు ధరలు పొందే విధానాలను ప్రశ్నించారు. రైతులకు అన్యాయం జరగకుండా, కనీస వసతులు కల్పించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.