పత్తికొండలో వైసీపీ చేసిందేమీ లేదు

57చూసినవారు
రాష్ట్రాభివృద్ధిలో విఫలమైన వైసీపీ నాయకులు కూటమి పాలనను విమర్శించడం తగదని కర్నూలు జిల్లా టిడిపి నాయకుడు సాంబశివారెడ్డి అన్నారు. ఆదివారం పత్తికొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో పత్తికొండ నియోజకవర్గంలో అభివృద్ధే లేదని, టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ధ్వంసం చేయడం తప్ప వైసీపీ నాయకులు చేసిందేమీ లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్