నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

68చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి
శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సీఎం చంద్రబాబుకు విన్నవించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలోని సీఎం ఓ కార్యాలయంలో సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బుడ్డా మర్యాదపూర్వకంగా కలిసి అభివృద్ధి అంశాలపై చర్చించారు. మధ్యలో నిలిచిపోయిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్