ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు ‘అవార్డ్ ఆఫ్ అప్రిసియేషన్’ లభించింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో మంగళవారం జరిగిన స్టేట్ మైనింగ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేతులు మీదుగా ఏపీ గనుల శాఖ సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. మేజర్ మినరల్స్ మైనింగ్ లీజుల జారీలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు గాను ఈ అవార్డు దక్కింది.