అనంతసాగరం మండలంలోని పలు గ్రామాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని ఆదివారం సాయంత్రం వర్షం పడింది. సోమశిల, అక్కర్లపాడు, గుడి గుంట, ఎగువపల్లి తదితర గ్రామాల్లో గాలితో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు, చిరు వ్యాపారస్తులు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాలు పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.