Apr 30, 2025, 11:04 IST/
యుద్ధ భయంతో బంకర్లలోకి పాక్ ప్రజలు (VIDEO)
Apr 30, 2025, 11:04 IST
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రధాని త్రివిధ దళాలకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చిన నేపథ్యంలో సరిహద్దుల్లో పాకిస్థానీయులు అప్రమత్తమయ్యారు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న భయంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అక్కడి ప్రజలు ముందస్తుగా బంకర్లలోకి చేరుతున్నారు. ‘ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగితే ప్రాణాలు పోతాయనే భయంతో ముందే బంకర్లలో దాక్కున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.