ట్రాక్టర్ ఆటో ఢీ.. ఒకరు మృతి.. పలువురు గాయాలు

15063చూసినవారు
ట్రాక్టర్ ఆటో ఢీ.. ఒకరు మృతి.. పలువురు గాయాలు
కందుకూరు మండలం మోపాడు సమీపంలో మంగళవారం ఆటో ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కందుకూరు పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కూలీలు ఆటోలో కూలి పనులకు వెళ్తుండగా మోపాడు సమీపంలో పొగాకు చెక్కలు లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఆటో ను ఢీకొంది. ప్రమాదంలో డాల లక్ష్మ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్