ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణం

72చూసినవారు
కావలి పట్టణంలోని జనతా పేట శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల నడుమ, మంగళ వాయిద్యాలతో నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. తదుపరి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్