లోక్సభ ఎన్నికలపై యూపీలో ఇండియా కూటమి నేతలతో కలిసి రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇండియా కూటమి ఆ వ్యవస్థలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల్లో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం, అతి పెద్ద సమస్యలు కానీ.. వాటిపై ప్రధాని మోదీ, బీజేపీలు మాట్లాడడం లేదు’ అని వ్యాఖ్యనించారు.