ఉత్తరప్రదేశ్లో ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. యూపీలోని 8 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అక్కడ నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ సందర్భంగా ఘజియాబాద్లో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో కలిసి రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు సహరాన్పూర్లో పార్టీ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్ షో నిర్వహించనున్నారు.