మానుబోలు: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన

72చూసినవారు
మానుబోలు: ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వెంకటాచలం సీఐ సుబ్బారావు తెలిపారు. శుక్రవారం సర్వేపల్లి రోడ్డు కూడలి వద్ద హెల్మెట్ మీద వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రమాదాల భారి నుంచి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ ధరించడం విస్మరిస్తే తర్వాత జరిగే అనర్థాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్