ఉదయగిరి మండలం అర్లపడియ గ్రామంలోని నూతన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మూడురోజులుగా విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం గ్రామ మహిళలతో పురోహితుడు లోక వెంకట ప్రసాద్ శర్మ సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అదిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.