చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని సీఎం జగన్ ప్రశ్నించారు. "చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా? రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్. ప్రస్తుత ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయిస్తాయి. పేదవాడి భవిష్యత్ కోసం రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుకే నొక్కాలి." అని నరసాపురం సభలో జగన్ పిలుపునిచ్చారు.