మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి మేరకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో మంగళవారం హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, పాలప్యాకెట్లు పంపిణీ చేశారు. జె. ఎన్. ఎన్. యు. ఆర్. ఎమ్ కాలనీలో 230 బ్లాక్స్ బాధితులకు ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ద్వారా ఆహారాన్ని అందజేయాలని మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మంత్రి నారా లోకేష్ ని కోరగా ఆయన వెంటనే స్పందించి హెలికాఫ్టర్లతో ఆహారం, తాగునీటి పంపిణీకి ఆదేశించారు.