గత ఎన్నికల్లో వైసీపీ గెలవలేదు: సుజనా

59చూసినవారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నివాసంలో హమాలీలతో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కానీ వైసీపీ గెలవలేదని అన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీ బీజేపీ అని అన్నారు.