సీఎం జగన్కు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. "జగన్కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇక చాలు.. వచ్చే ఎన్నికల్లో మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోవాలి. హక్కుల కోసం పోరాడితే ప్రజలపై కేసులు పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని అడిగితే కొట్టారు. గంజాయి సరఫరాలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది.. ఏపీలో 23 లక్షల మంది దీనికి అలవాటు పడ్డారు." అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.