టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ప్రజాగళం యాత్రలో టీడీపీ అసమ్మతి నేతల నుంచి నిరసన సెగలు తగులుతున్నాయి. నిన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు ఉండి ఎమ్మెల్యే సీటు కేటాయించిన విషయం తెలిసిందే. దాంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుయాయుడు పాలకొల్లులో చంద్రబాబు బస చేసిన చోటుకెళ్లి నిరసనకు దిగారు. ఉండి టికెట్ రామరాజుకే ఇవ్వాలని ఆయన వర్గీయులు ఆందోళన చేశారు.