తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..!

76చూసినవారు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం 17 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న శ్రీవారిని 75,414 మంది భక్తులు దర్శించుకోగా.. 30,073 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్